Kesineni Nani | ఏపీలో కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రెస్మీట్ పెట్టి మరీ చంద్రబాబు తనను తిట్టించాడని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై బుద్ధావెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు తనతో తిట్టించలేదని తన పిల్లలపై ఒట్టేసి మరీ చెప్పారు. దమ్ముంటే చంద్రబాబు తిట్టించినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి విమర్శలు చేస్తే చంద్రబాబే తనను మందలించారని అన్నారు. చంద్రబాబు చెప్పారు కాబట్టే ఇన్నాళ్లు ఆగానని తెలిపారు. విజయసాయితో కేశినేని నానికి ఎప్పట్నుంచో పరిచయం ఉందని.. ఆయన వైసీపీ కోవర్టు అని ఆరోపించారు.
60 శాతం టీడీపీని ఖాళీ చేస్తామన్న నాని వ్యాఖ్యలపై కూడా బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేవని ధ్వజమెత్తారు. అసలు వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలుస్తాడా? అని బుద్ధా వెంకన్న అన్నారు. కేశినేని గెలిస్తే బుద్ధా భవన్ ఇచ్చేస్తా.. తాను గెలిస్తే కేశినేని భవన్ ఇస్తావా? అని సవాలు విసిరారు. నువ్వెంత? నీ స్థాయి ఎంత? అని ధ్వజమెత్తారు.