Chandra Babu | హద్దులు దాటితే నియంత్రించడం కష్టం అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేసిన టీడీపీ నేత పట్టాభి ఇంటిని ఆయన మంగళవారం సందర్శించారు. ఇంటిలో ధ్వంసమైన సామాగ్రిని పరిశీలించారు. పట్టాభి కుటుంబ సభ్యులను అడిగి దాడి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు బరి తెగిస్తే పోలీసులు పారిపోవడం ఖాయం అని మీడియాతో అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయని ఆరోపించారు.
రాష్ట్రంలో గంజాయి సాగు చేస్తున్నదెవరని చంద్రబాబు ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సాక్ష్యాధారాలు ఇవ్వాలా.. దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులది కాదా? పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దాడులకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్చేశారు.
చంద్రబాబుతోపాటు పట్టాభి ఇంటిని సందర్శించిన వారిలో టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వర్రావు, కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్, వంగవీటి రాధా తదితరులు ఉన్నారు.