అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వరుస మరణాలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈవాళ జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముందుగా జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం చర్చించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమకు చర్చకు అనుమతించాలని నినాదాలు చేశారు.
టీడీపీ పక్షనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో సమావేశాన్ని కొంతసేపు వాయిదా వేసిన స్పీకర్ అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. సరైన ఫార్మాట్లో వస్తే చర్చకు సిద్ధమని ప్రభుత్వం తరుఫున స్పీకర్ పేర్కొనగా ఈరోజే చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.