అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి తన కాళ్ల దగ్గర ఉన్న చిత్రాన్ని జగన్ ఫేస్బుక్లో పెట్టి ఎస్సీలను అవమానించారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్తోపాటు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.