అమరావతి : కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడోరోజు పర్యటించారు. మోడల్ కాలనీలో ఆయన పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. టీడీపీ హయాంలో 650 గృహాలతో మోడల్ కాలనీ నిర్మాణం ప్రారంభించామని వన్ ప్లస్ త్రీ విధానంలో మూడు వేల మందికి ఇవ్వాలని ప్రణాళిక చేశామని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్ల విస్తరణ ఆపేశారని అన్నారు.
కుప్పంపై ప్రేమ ఉంటే మరో 10 వేల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుప్పం నియోజకవర్గంపై కక్షగట్టి దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదవాడి పొట్టనింపే అన్న క్యాంటీన్ను ధ్వంసం చేశారని మండి పడ్డారు. పేదలకు అన్నం పెట్టే పార్టీ టీడీపీని, పేదల పొట్టకొట్టే పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేవారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించి ఉంటే జగన్ బయట తిరిగేవారా అని ప్రశ్నించారు.