అమరావతి: రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి(Alliance) తప్పకుండా అధికారంలోకి వస్తుందని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) దీమాను వ్యక్తం చేశారు. విజయవాడ తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్(NTR)విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చి ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని,పేద బడుగు, బలహీన వర్గాలకు అధికార పీఠం పైకి ఎక్కించారని పేర్కొన్నారు. రెసిడెన్సియల్ స్కూల్, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల (Engineering College) ఏర్పాటు చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చార. ప్రజలు ఓటు అనే అయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జవాబుదారితనం పాలన, పిల్లల భవిష్యత్ కోసం కూటమిని ఆశీర్వదించాలని కోరారు.