విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో కేవలం శ్రీశైలానికి చెందిన రజాక్ విషయాన్నే పేర్కొన్నారు. రజాక్ను వైసీపీ నేతలు వెనకేసుకొస్తున్నందునే భక్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని లేఖలో తెలిపారు.
ఏపీ సీఎం జగన్కు రాసిన లేఖలో.. రజాక్ చక్రవ్యూహంలో శ్రీశైలం విలవిలలాడుతున్నదని, శ్రీశైలానికి రజాక్ శాపగ్రస్తంలా తయారయ్యాడని సోము వీర్రాజు చెప్పారు. రజాక్ అరాచకాలను ఎదిరిస్తే కేసులు పెడుతున్నారని, రజాక్ ఆగడాలను అధికారులు అడ్డుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రజాక్ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో జగన్కు సోము వీర్రాజు విజ్ఞప్తిచేశారు.
ఇలాఉండగా, రజాక్ విషయంపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. తనకు తెలిసి రజాక్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఫోన్లో మాట్లాడిన విషయం తప్పైనందునే రజాక్ను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. రజాక్ అరెస్ట్ విషయంలో తాను జోక్యం చేసుకోనని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు.