అమరావతి : గార్బేజ్ ఫ్రీ సిటీ గా కడప నగరపాలక సంస్థ త్రి స్టార్ రేటింగ్ పొందింది. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలో జరిగిన “స్వచ్ఛ సర్వేక్షన్-2021” కార్యక్రమoలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న(కడప నగరపాలక సంస్థ పూర్వ కమిషనర్) భారత ప్రభుత్వ కార్యదర్శి చేతుల మీదుగా అవార్డ్ ను స్వీకరిoచారు.
దేశవ్యాప్తంగా జరిపిన సర్వే ద్వారా ఎంపిక చేయబడిన నగరాలలో ఏపీ నుంచి కడప, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరపాలక సంస్థలు ఈ అవార్డ్ ను దక్కించుకున్నాయి. చెత్త రహిత, బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం స్థానిక ప్రజలను చైతన్య పరచడం, వారిని ప్రోత్సహించడం , స్వచ్చ భారత్ పై అందరిలో అవగాహన కల్పించడం తదితర అంశాల్లో సర్వే నిర్వహించి ఆ ప్రాంతాలకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అందజేస్తుంది.