Srisailam | అయోధ్య శ్రీరామాలయం ప్రారంభోత్సవంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఆలయాల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని ప్రధానమంత్రి ఆదేశాల మేరకు శ్రీశైల దేవస్థానం పరిధిలో స్వఛ్చ్తీర్థ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ధర్మకర్తలమండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అన్నారు. ఈవో పెద్దిరాజు అధ్యక్షతన ఆదివారం ప్రధాన ఆలయంతోపాటు పరివార దేవతాలయాలు, క్యూకాంప్లెక్యులు, లడ్డూ విక్రయ కేంద్రము తదితర ప్రాంతాల్లొ వారం రోజులపాటు స్వఛ్చ్ తీర్థకార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ విభాగాధిపతులు అధికారులు సిబ్బంది పాల్గొని పారిశుద్యం పనులు చేశారు.
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనంలో రెండు రోజులపాటు జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా శ్రీశైల మల్లన్న లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సూచనల ప్రకారం దేశ రాజధానిలో గల మల్లన్న భక్తులకు ప్రసాదాలతోపాటు విభుతి, కుంకుమ, వార్షిక క్యాలెండర్, డైరీలు, శ్రీశైలప్రభ ప్రతులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.