అమరావతి : ఏపీ శాసన సభ సమావేశాలను అడ్డుకుంటున్నారని ఆరోపణతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఒకరోజు పాటు సస్పెన్షన్కు గురి చేశారు. కీలకమైన అంశాలపై చర్చ జరుగుతుండగా ఇతర అంశాలను లేవనెత్తడంతో పాటు తమకు చర్చకు అవకాశం ఇవ్వాలని పోడియం వద్దకు దూసుకొచ్చిన దేశం ఎమ్మెల్యేల ను ఒకరోజు పాటు సస్పెన్షన్ చేయాలని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్ మాట్లాడుతూ వారిని ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సస్పెన్షన్కు గురైన వారిలో ఎమ్మెల్యేలు అశోక్, కింజవరపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకట్రెడ్డి, జోగేశ్వర్రావు, పయ్యవుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, వెలగపుడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు. అంతకు ముందు దాదాపు రెండు గంటల పాటు వికేంద్రీకరణ అంశం, మూడు రాజధానులు తదితర అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగింది .