అమరావతి : ఏపీలో కొత్త మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు రాని నాయకులు, అనుచరుల్లో అసంతృప్తి, బాధ తాత్కలికమేనని ప్రధాన సలహాదారుడు సజ్జల రాంచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అసంతృప్తవాదులతో ఏపీ సీఎం జగన్ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. మంత్రి పదవులకు సమానంగా ఉండే జిల్లా అధ్యక్ష పదవులతో పాటు రీజినల్ పదవులు వస్తాయని ఎవరూ బాధ పడవద్దని, అపోహాలు పెంచుకోవద్దని సూచించారు.
మంత్రి పదవులు వస్తే ఎక్కువ రాని వారు తక్కువ అని కాదని స్పష్టం చేశారు. మంత్రివర్గంపై ప్రతిపక్ష టీడీపీ నాయ కులు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని, వారి ప్రచారాలు దూదిపంజ మాదిరిగా ఎగిరి పోతాయని తెలిపారు. మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. చంద్రబాబు హయాంలో కేవలం 14 మంత్రి పదవులే ఇచ్చారని, మిగత పదవులు ఎందుకు నింపలేదని ఆరోపించారు. గతంలో ప్రకటించిన విధంగానే మంత్రులతో రాజీనామా చేయించి కొత్త టీంను నియమించారని సజ్జల ప్రకటించారు.