తిరుమల : వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున సుదర్శన చక్రత్తాళ్వార్కి వరాహ పుష్కరిణిలో అభిషేకాలు చేశారు. కరోనా ప్రభావం వల్ల భక్తులను అధికారులు అనుమతించలేదు.
కాగా నిన్న 46,118 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 10,594 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.