తిరుమల : సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలు సీసీ కెమెరాల నిఘాలో జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముండడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఇవాళ తిరుమలలోని కార్యాలయంలో ఈవో సమీక్ష నిర్వహించారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
సెప్టెంబర్ 27న ధ్వజారోహణం రోజు స్వామివారికి ఏపీ సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. 9 రోజుల పాటు నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే సర్వదర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. గరుడ వాహనం రోజు తిరుమలకు బైకులకు అనుమతి నిరాకరిస్తున్నామని వివరించారు.