శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల (Mahashivratri Brahmotsavam) సందర్భంగా దేవస్థానం ఈవో పెద్దిరాజు(EO Peddiraju) ఆదివారం పలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నదాన ప్రదేశాలు, భక్తులు వేచియుండే గదులు, వంటశాలను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల (Devotees) రద్దీకి తగ్గట్టుగా సరిపడ వంటకాలను సిద్ధం చేయాలని, వంటశాలను తరుచూ శుభ్రం చేయాలని కోరారు.
స్వచ్ఛందంగా అన్నదానం చేసే సంస్థలకు దేవస్థానం పూర్తి సహాయ, సహకారాలను అందిస్తుందని పేర్కొన్నారు. యజ్ఞవాటిక, గణేశసదన్, విభూతిమఠం, ఆగమ పాఠశాల, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలను, టోల్గేట్ కూడలి, మల్లికార్జున సదనం కూడలి, వైద్యశాల కూడలి ప్రాంతాలను పరిశీలించారు. పాదాచారులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.
పల్స్పోలియో కేంద్రం ప్రారంభం
ఆలయ మహాద్వారం వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటుచేసిన పల్స్పోలియో (Pulse Polio) కేంద్రాన్ని ఈవో పెద్దిరాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా 5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.