తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో శ్రీనివాస కల్యాణాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వరుస కల్యాణోత్సవాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. ప్రాంగణమంతా వేద మంత్రాలతో మారుమోగింది.
కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, కళ్యాణోత్సవానికి ఆర్థిక సహకారం అందించిన పీపుల్ టెక్ సంస్థ సీఎండీ టీజీ విశ్వప్రసాద్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.