అమరావతి : ప్రయాణికుల సౌకర్యార్ధం విజయవాడ నుంచి నాగర్సోల్ నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 5, 12, 19 తేదీల్లో విజయవాడలో సాయంత్రం 4.15 గంటలకు బయలు దేరే నంబర్ 07698 అనే నంబర్ గల రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు నాగర్ సోల్కు చేరుకుంటుందని వివరించారు. ఈ రైలు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్ , జహీరాబాద్, బీదర్ , ఔరంగబాద్ స్టేషన్లలో ఆగుతుందని వివరించారు.
అదే విధంగా 07699 అనే నంబర్ గల రైలు 6,13,20 తేదీల్లో నాగర్ సోల్లో రాత్రి 10 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుందన్నారు. ఈ రైలు ఔరంగబాద్, బీదర్ , జహీరాబాద్, వికారాబాద్,లింగంపల్లి, సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి,పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.