గుంటూరు డివిజన్ మీదుగా హతియా-సికింద్రాబాద్-హతియా ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సీనియర్ డీసీఎం తెలిపారు. గుంటూరు డివిజన్ మీదుగా 08615 నంబర్ హతియా-సికింద్రాబాద్ రైలు ఈ నెల 10వ తేదీ శుక్రవారం నుంచి నడుస్తుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం రాత్రి 11.55 గంటలకు హతియాలో బయలుదేరి ప్రతి ఆదివారం ఉదయం 5.30 గంటలకు గుంటూరుకు.. మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 08616 నంబర్ సికింద్రాబాద్-హతియా రైలు ప్రతి సోమవారం రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు హతియా స్టేషన్కు చేరుకుంటుంది. కాగా, డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు డివిజన్ సీనియర్ డీసీఎం తెలిపారు. లింగంపల్లి-విశాఖపట్నం 12806 నుంచి విజయవాడ-విశాఖపట్నం మీదుగా వెళ్లే రైలు ఈ నెల 18న తాత్కాలికంగా రద్దు చేశారు. విశాఖపట్నం-లింగంపల్లి మీదుగా విశాఖపట్నం-విజయవాడ 12805 నంబర్ రైలును తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.