హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చిందని తెలిపారు. విభజన చట్టం హామీలను కూడా అమలు చేసిందని పేరొన్నారు. బుధవారం ఏపీలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు. రాబోయే ఐదేళ్లు కూటమితో కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.