తిరుమల : కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో సెప్టెంబరు ( September ) నెలలో విశేష పర్వదినాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబరు 7న గోకులాష్టమి ( Gokulastami ) , 8న ఉట్లోత్సవం, 17న బలరామ జయంతి, వరాహ జయంతి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ( Brahmotsavam ) అంకురార్పణ జరుగుతుందని వివరించారు.
18న వినాయక చవితి ( Vinayka Chavithi) , ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని , 22న శ్రీవారి గరుడసేవ, 23న శ్రీవారి స్వర్ణరథోత్సవం , 25న రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 26వ తేదీన శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి, 27న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం, 28న అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.