తిరుమల : తిరుమల గిరి కొండపై సెప్టెంబర్ నెలలో నిర్వహించే పర్వదినాల వేడుకలను టీటీడీ వెల్లడించింది . సెప్టెంబర్ 1న ఋషి పంచమి, 6న, 21న సర్వ ఏకాదశి, 7న వామన జయంతి, 9న అనంత పద్మనాభ వ్రతం, 11న మహాలయ పక్ష ప్రారంభం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
13న బృహత్యుమా వ్రతం(ఉండ్రాళ్ళ తద్దె), 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 25న మహాలయ అమావాస్య, 26న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్నొన్నారు. 27న ధ్వజారోహణంతో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుందని వివరించారు.