అమరావతి : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు చేసిన రాజీనామాను ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ స్పీకర్కు మరోసారి మొరపెట్టుకున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి తన రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గత యేడాది తాను రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఈ రాజీనామాను అంగీకరించాలని స్పీకర్ను ఆయన కోరారు. ఇటీవల కాలంలో టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటున్నారు.