అమరావతి : టీడీపీ హయాంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే కొందరి రైతులకే నష్టపరిహారం ఇచ్చారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కౌలు రైతులకు సైతం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామని వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేశారు.
1,220 గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు , 5లక్షల 17వేల మంది రైతులకు రూ.571. 57 కోట్లు జమా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్ల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నా యని, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. పంట నష్టాన్ని ఏ సీజన్లో జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్నామని అన్నారు.
అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లోనే ప్రదర్శిస్తున్నామని వెల్లడించారు. రైతులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటున్నామని వెల్లడించారు.