అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఇకపై పదో తరగతి పరీక్షలో ఆరు పేపర్లే ఉంటాయని వెల్లడించింది. ఈ కొత్త సంవత్సరం నుంచే ఈ విధానం అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 పేపర్ల స్థానంలో ఆరుపేపర్లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది.