అమరావతి: ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ వెలిసిన ఓ పోస్టర్.. కలకలం రేపుతున్నది. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ గుంజే పల్లి గ్రామ ప్రజలు ఓ పోస్టర్ ను ఏర్పాటు చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతి గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలపగలరు.
ఇట్లు గుంజే పల్లి గ్రామ ప్రజలు, శింగనమల నియోజకవర్గం’’ అంటూ పోస్టర్లో తెలిపారు. తమ సమస్యలు పట్టించుకోకపోవడంతో ఇలా పోస్టర్ ద్వారా నిరసన వ్యక్తం చేశామని గ్రామప్రజలుపేర్కొన్నారు.