Srisailam : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైల పర్యటనను విజయవంతం చేయాలని ఆలయ ఈవో లవన్న అన్నారు. ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లవన్నరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గంగాధర మండపం, ఆలయంతో పాటు పర్యాటక కేంద్రం దగ్గర సిబ్బందిని కేటాయించాలని అసెస్టెంట్ కమిషనర్ వెంకటేశ్ను ఆయన ఆదేశించారు. పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
అంతేకాదు ఆలయ పరిధిలోని దారిలో గుంతలు లేకుండా చూడాలని, విద్యుత్ సరఫరాకు ఆటకం కలగకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు లవన్నసూచించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులు, జిల్లా అధికారులకు వసతి ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ ఈవో ఐఎన్వి. మోహన్ను ఆదేశించారు. ఉద్యానవన విభాగ ఆ రోజు యథావిధంగానే ఆలయంలో పుష్పాలంకరణ చేయాలని లవన్న అన్నారు. ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.