అమరావతి : నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకున్నది. సభా ప్రాంగణానికి దగ్గరలో మురికి కాలువ ఉండగా.. సభకు హాజరయ్యే క్రమంలో తొక్కిసలాట జరిగిందని సమాచారం. పలువురు కాలువలో పడిపోయగా.. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. తొక్కిసలాటలో పలువురు గాయపడగా.. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు విద్యాసంస్థల్లో చదివిపిస్తామని హామీ ఇచ్చారు. తోపులాట నేపథ్యంలో సభను రద్దు చేసుకున్నారు. బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించారు. సంతాపంగా మృతులకు రెండు నిమిషాలు మౌనం ప్రకటించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.