అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్కు ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంది. గన్మెన్లు వెనక్కి రావాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల ఫోన్లను వైసీపీ ట్యాపింగ్ చేస్తున్నారని ఇటీవల కేశవ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో పెగాసస్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రభుత్వ వేసిన కమిటీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పకొడుతున్న కేశవ్పై ప్రభుత్వం కక్షగట్టిందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వానికి వివరణ ఇచ్చాకే భద్రత ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బెదిరింపుల్లో భాగమే పయ్యావులకు భద్రతను ఉపసంహరించారని పేర్కొన్నారు.