తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వెల్లడించారు. నిన్న 63,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 25,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.07 కోట్లు వచ్చిందని తెలిపారు.
ఫిబ్రవరి 19న తిరుమలలో అనంతాళ్వారు 969వ అవతారోత్సవం
శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 969వ అవతారోత్సవాన్ని ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలోని పురుశైవారి తోటలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తున్నామని, 16 మంది పండితులు పాల్గొని ఉపన్యసించనున్నారని పేర్కొన్నారు.