తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 59,236 మంది భక్తులు దర్శించుకోగా 25,446 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 4.38 కోట్లు వచ్చిందన్నారు.
శనివారం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియుండగా టోకెన్లు లేని వారికి 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
మార్చి 25న పౌర్ణమి గరుడ సేవ
పౌర్ణమి సందర్భంగా ఈనెల 25న తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడసేవ(Garuda Seva)ను నిర్వహించనున్నారు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వక్ె సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారిని గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు.