అమరావతి: కరోనా కాలంలో ఇలా వేలమందితో సభలు పెట్టి పవన్ కల్యాణ్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజమండ్రిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ నేపథ్యంలో సజ్జల ఈ కామెంట్లు చేశారు. ఈ సభ ద్వారా పవన్ ఏం నిరూపించాలని అనుకుంటున్నారో అసలు అర్థం కావడం లేదని సజ్జల అన్నారు.
కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న ఈ సమయంలో వేలమందితో సభలు ఎలా నిర్వహిస్తారు? అని పవన్ను ప్రశ్నించారు. ’’సీఎం కార్యక్రమాల్లో ఎంతమందిని అనుమతించామో చూసే ఉంటారు. అలాగే రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 2,300 కోట్లు కేటాయించింది. నవంబరు నుంచి పనులు కూడా ప్రారంభం అవుతాయి‘‘ అని సజ్జల చెప్పారు.