అమరావతి : ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో శ్రీశైలం డ్యాం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 4,16,384 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 4,39,596 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.50 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని కొనసాగించడానికి ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతున్నారు.