అమరావతి :ఏపీ సినిమా టికెట్ ధరలపై మంత్రి పేర్నినానితో దర్శకుడు రాంగోపాల్ వర్మ సమావేశం అయ్యారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా వర్మ మంత్రి పేర్ని నానికి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి స్పందించిన మంత్రి రామ్ గోపాల్ వర్మను చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఆయన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. “చిరంజీవి, నాగార్జున చేసిన వ్యాఖలపై మాట్లాడనని, తానూ కేవలం ఒక దర్శకుడిగా మాత్రమే వచ్చానని, సినిమా పరిశ్రమ తరపున కాదని స్పష్టం చేశారు. ‘‘పేర్ని నానితో మాట్లాడి అన్ని విషయాలు చెబుతా. ఆయనకు ఉన్న అనుమానాలు క్లియర్ చేస్తా. ఎవరు ఏం మాట్లాడినా అవి వ్యక్తిగతమని” వర్మ అన్నారు.