అమరావతి : ఏపీలోని విజయవాడ రైల్వేయార్డు వద్ద బుధవారం ఓ వ్యక్తి అనుమానాస్పదన స్థితిలో మృతి చెందాడు. రైల్వే పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు హైదరాబాద్ వాసిగా అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి మెడపై గాయాలుండడంతో మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఈ దారుణానికి పాల్పడిందా అనే కోణంలోనూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాగిలాలను రప్పించి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.