అమరావతి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీలోని జలాశయాలు నిండుకుండళ్ల తలపిస్తున్నాయి. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ప్రధాన జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్కు వరద కొనసాగుతుంది. అధికారులు బ్యారేజ్ 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4,12,769 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,32,723 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,35,786 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం: 884.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు ప్రస్తుతం: 210.9946 టీఎంసీలుగా కొనసాగుతుంది.
కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయం 10 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 38,567 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 32,402 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తి నీటిమట్టం 1633 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 1632.65 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటినిల్వ 104.383 టీఎంసీలుగా కొనసాగుతుంది.