తిరుమల : తిరుమలలోని వేంకటేశ్వరుడిని ఆగస్టు నెలలో దర్శనం చేసుకునేందుకు టీటీడీ అధికారులు ఆన్లైన్ కోటా (Online quota) తేదీలను ప్రకటించారు. దర్శనం, వసతి, శ్రీవారి సేవా స్వచ్ఛంద సేవ ఆన్లైన్ కోటా వివరాలను వెల్లడించారు. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ్ డీప్ రిజిస్ట్రేషన్లు మే 18 ఉదయం 10 గంటల నుంచి మే 20 ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు ప్రకటించారు. సేవా లక్కీ్ డీప్ చెల్లింపు వ్యవధి మే 20 నుంచి మే 22 వరకు ఉంటాయని వివరించారు.
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు అనగా కల్యాణం(Kalyanam), ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఎస్డీ సేవతో పాటు వార్షిక పవిత్రోత్సవం టిక్కెట్లు (ఆగస్టు 15-17) మే 21 ఉదయం 10 గంటల నుండి, వర్చువల్ సేవా టిక్కెట్లు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచానున్నామని వివరించారు.
తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు మే 23 నుంచి ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి కోటా మే 23న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంచానున్నామని వెల్లడించారు. మే 23న సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా మధ్యాహ్నం 3 గంటల నుంచి, మే 24న 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లు , అదే రోజు మే మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుమల, తిరుపతి వసతి కోటా అందుబాటులో ఉంటుందని వివరించారు.
మే 27న శ్రీవారి సేవా, స్వచ్ఛంద సేవా జనరల్ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేయనున్నామని పేర్కొన్నారు.
బుకింగ్ల కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే లాగిన్ కావాలని తెలిపారు.