అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ను వాహనం ఢీకొట్టి చంపేశారు. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్ఫోర్స్ సిబ్బందికి సోమవారం రాత్రి సమాచారం అందింది. దీంతో సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద సిబ్బంది కాపు కాశారు. ఈ క్రమంలో ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు యత్నించాడు.
అయితే గుర్తించిన స్మగ్లర్లు తప్పించుకునే క్రమంలో అతడిని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్లు తోటి సిబ్బంది పీలేరు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. గాలింపు చేపట్టిన పోలీసులు ఎర్రచందనం వాహనంతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఏడు దుంగలు ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.