అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొందరు ఐపీఎస్ అధికారుల తీరుపై కేంద్రం గట్టి నిఘా వేసి ఉంచిందని, ప్రవర్తన తీరుపై వారిని రీకాల్ చేసే అవకాశముందని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరు దారుణంగా ఉందని విమర్శించారు.
రాష్ట్ర పోలీసు తీరును కేంద్రం టెలీస్కోప్లో చూస్తుందని అన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళనకు కేంద్రం చర్యలు తీసుకునే అవకాశముందని, అవసరమైతే ఐపీఎస్లను రీకాల్ చేసే అవకాశముందని వ్యాఖ్యనించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి..పోతుంటాయి.. కాని వ్యవస్థ ఉంటుందని గుర్తించుకోవాలని ఐఏఎస్, ఐపీఎస్లకు సూచించారు.