తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా ( TTD EO ) ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రంగనాయకుల మండపంలో రవిచంద్ర పండితులు ఆశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. టీటీడీలో పనిచేస్తున్న సీనియర్ అధికారులు, అర్చకులు, భక్తుల సలహాలతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పని చేస్తానని తెలిపారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 61,655 మంది భక్తులు దర్శించుకోగా 21,003 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.3.89 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు.