అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అల్లూరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం, నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు నుంచి కర్నాటకకు తరలిస్తున్న 170 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకోగా ఒకరు పరారయ్యాడని పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలు, రెండు ఆటోలను సీజ్ చేశారు.
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఇరుకురాయిలోని రైస్ మిల్లులో గంజాయిని నిల్వ ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్,రెవెన్యూ అధికారులు రైస్మిల్లుపై దాడి చేశారు. రైస్మిల్లులో 2,100 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు.