అమరావతి : ఏపీలో నాలుగు నెలలుగా నిలిపివేసిన రేషన్ బియ్యం పంపిణీని ఆగస్టు 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులుంటే కేంద్రం 89 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.
వెనుకబడ్డ తొమ్మిది జిల్లాలు, ఎస్సీ, ఎస్టీలకు బియ్యం అందిస్తామన్నారు. ప్రతి నెలా ఇచ్చే రేషన్కి అదనంగా కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రేషన్ షాపులను మూసేస్తామని చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కార్డులు మంజూరు చేశామని గుర్తు చేశారు.