అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల ( Macherla ) పట్టణంలో ఒంటరి మహిళపై దుండగుడు అత్యాచారం ( Rape ) చేసి పాశవికంగా హింసకు గురిచేసిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ప్రభుత్వం అదనపు ఎస్పీ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించింది .
సత్తెనపల్లికి చెందిన మహిళ( Women ) ఉద్యోగం చేస్తూ మాచర్లలో ఒంటరిగా ఉంటుంది. గుడ్ఫ్రైడే సందర్భంగా ఆమె సత్తెనపల్లికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆమెను వివస్త్రను చేసి, కాళ్లు చేతులు కట్టేసి, దారుణంగా హింసించి పరారయ్యాడు. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో అనుమానితుడిని గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.