అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. ఇక్కడ 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. మండలంలోని గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిట్రపట్టి, గూళెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదేహాల్ వద్ద తాత్కాలిక వంతెన కోతకు గురైంది.
నెల్లూరు, కావలి, గుడ్లూరులో ఈదురు గాలులతో వర్షం కురిసింది . తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సైతం పలుచోట్ల వర్షం రాజమహేంద్ర వరం, కోనసీమలో కుండపోత వర్షం పడింది . విశాఖ జిల్లా రుషికొండ, ఎండాడ, డెయిరీఫామ్ ప్రాంతాల్లో వర్షం నమోదయింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపల కంచేరులో పిడుగుపాటుకు కారి చిన్న (16) అనే బాలుడు మృతి చెందాడు.