అమరావతి : రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు వంగవీటి రాధా చేయొద్దని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. వంగవీటి రాధా రెక్కీ అంశంపై ఆదివారం మంత్రి వ్యాఖ్యలు చేశారు. రాధా హత్యకు రెక్కీ ఆధారాలుంటే బయట పెట్టాలని పేర్కొన్నారు. రెక్కీ ఎవరూ చేయబోయారు.. రెక్కీపై పోలీసులకు ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. ‘ రాధా ఇళ్లు మెయిన్ రోడ్డులో ఉంది. అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుతుందా ’ అన్నారు. టీడీపీ హయాంలో వంగవీటి రంగాఎందుకు దీక్ష చేశారో తెలుసుకోవాలని సూచించారు.
టీడీపీ హయాంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాడుతున్నారని ఆరోపించారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే స్పందించిన వ్యక్తి సీఎం జగన్ .. భద్రత కోసం గన్మెన్లను పంపితే తిరిగి వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పుడు డైరెక్షన్లో రాధా వెళ్లొద్దని కోరారు.