తిరుపతి : తిరుపతి(Tirupati)లోని శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం వైభవంగా పుష్పయాగం నిర్వహించారు. ఫిబ్రవరి 14 నుంచి 22వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం(Puspayagam) నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని వారు పేర్కొన్నారు.