అమరావతి : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక లైంగిక దాడికి గురైన యువతిని పరామర్శించేం దుకు వచ్చిన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్కు నిరసనలు ఎదురయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వచ్చారు. అప్పటికే వివిధ మహిళా సంఘాలు, టీడీపీకి చెందిన మహిళలు ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతుండగా అక్కడికి వచ్చిన చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆమె లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
చివరకు పోలీసు బలగాలతో ఆమె బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా బాధితురాలిని పరామర్శించేందుకు రాగా ఆందోళనకారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని మహిళలు మండిపడ్డారు.