తిరుపతి : తిరుపతిలోని వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి కళాశాల అధ్యాపకులు, సిబ్బందిని అభినందిం చారు. టీటీడీ పరిపాలన భవనంలో జేఈవో సదా భార్గవి, డీఈవో గోవిందరాజన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్నారాయణమ్మతోపాటు అధ్యాపకులు ఈవోను కలిశారు.
ఈవో మాట్లాడుతూ జేఈవో నేతృత్వంలో టీటీడీ కళాశాలలో విద్య ఇతర మౌళిక సదుపాయాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. ఇటీవల కాలంలోనే పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలకు కూడా న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ లభించిందని, ఇదేతరహాలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ లభించడం అభినంద నీయమన్నారు. టీటీడీలోని ఇతర విద్యాసంస్థలు వీటిని ఆదర్శంగా తీసుకుని మంచి ప్రమాణాలు నెల కొల్పడానికి పనిచేయాలన్నారు.ఈవోను కలిసిన వారిలో కళాశాల అధ్యాపకులు భాస్కరుడు,ఉష, వాణి, విజయశ్రీ, ప్రసాదరావు, చలపతి పాల్గొన్నారు.