అమరావతి : కాకినాడ జిల్లా తుని ( Tuni ) లో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి(Jnaneswari ) అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి ఏడు రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల పెంపుడు కుక్క (Pet dog ) మృతి చెందడంతో పోలీసులకు దర్యాప్తు పెను సవాల్గా మారింది. నిన్నటి నుంచి కుక్క ఆహారం తినక మృతి చెందింది. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఈ కుక్క కీలక ఆధారంగా మారింది.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదివారం నుంచి 200 మంది పోలీసు సిబ్బంది దాదాపు 500 ఎకరాల అటవీ కొండ ప్రాంతాన్ని గాలించారు. గత శనివారం నుంచి చిన్నారితో కనిపించ కుండా పోయిన కుక్క మూడు రోజుల అనంతరం ఇంటికి చేరుకుంది. ఆ శునకాన్ని పట్టుకుని జీపీఎస్ ట్రాకర్ అమర్చి వదిలి పెట్టగా తిరిగా ఆ శునకం ఇంటికి చేరుకుంది. ఆహారం తినక కుండా శనివారం మృతి చెందింది.
నిజంగానే పాప అడవిలో తప్పిపోయిందా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ టీవీ కెమెరాలను కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహనాల రాకపోకలను కూడా ఆరా తీస్తున్నారు. అయితే తన కుమార్తెను భర్త స్నేహితులే కిడ్నాప్ చేసి ఉంటారని భవానీ ఆరోపిస్తుంది. చిన్నారి తల్లి భవానీ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె అడవిలో ఉండచకపోవచ్చని.. కచ్చితంగా ఎవరో తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.