అమరావతి : ఏపీలో టీడీపీ(TDP), జనసేన(Janasena) కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ ( BC declaration) సభలో కూటమి నాయకులు వెల్లడించారు. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పది అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ పత్రాన్ని విడుదల చేశారు.
పింఛన్ నెలకు రూ.4వేలకు పెంచుతామని , బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని(BCs protection Act) తీసుకువస్తామని, సామాజిక న్యాయపరిశీల కమిటీ ఏర్పాటు , సబ్ ప్లాన్తో ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని డిక్లరేషన్లో పేర్కొన్నారు. సబ్ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు , స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేస్తామని ప్రకటించారు.
అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్, కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం, జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు, జనామా దామాషా ప్రకారం నిధులుకేటాయింపు చేస్తామని వెల్లడించింది. స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తామని, రూ.5 వేల కోట్లతో ఆదరణ పరికరాలు అందజేస్తామని సభ ప్రకటించింది.