హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఏతో కలవడం బాధాకరమని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) పేర్కొన్నారు. మతవాద పార్టీ బీజేపీ తో పవన్ (Pawan Kalyan) చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి,లౌకిక వాదానికి ప్రమాదకరమని అన్నారు. గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజం పైన గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కార్ వైపు దారి తప్పి నడవడం సరికాదని పేర్కొన్నారు.
తమతో పొత్తులు పెట్టుకోని ప్రాంతీయ పార్టీలను సీబీఐ(CBI), ఎన్ఫోర్స్మెంట్(Enforcement) సంస్థలతో దాడులు చేయించడం వంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న బీజేపీ కి మద్దతు పలకడం శోచనీయమని వెల్లడించారు. బీజేపీ,టీడీపీ ల మధ్య మధ్యవర్తిత్వం చేయడం రాజకీయాలకు మంచిది కాదని అన్నారు.