Pawan on Vishaka Steel | విశాఖ స్టీల్ను ప్రయివేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 31న విశాఖలో బహిరంగసభ నిర్వహించాలని పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. అయితే, సభా వేదిక ఏర్పాటుపై పోలీసులతో జనసేన నాయకులకు వివాదం ఏర్పడింది. కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద సభ నిర్వహణకు జనసేన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలీసులు సభా వేదికను మార్చాలని జనసేన నాయకులకు సూచించారు.. జనసేన నాయకులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఆరునూరైనా ఇక్కడే సభ జరుపుతామంటూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఈ తరుణంలో పవన్కల్యాణ్ సభ జరుగుతుందా.. లేదా.. అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ సారధ్యంలోని జనసేన.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు మిత్రపక్షంగా ఉన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ జరుపాలని పవన్ కల్యాణ్ నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆహ్వానం మేరకు ఆదివారం విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్లి కార్మికులతో ముచ్చటిస్తారు.
మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఇప్పటికే విశాఖ ఉక్కు.. ఆంధ్రుల భావోద్వేగంతో ముడిపడి ఉన్న ఫ్యాక్టరీ అని.. దీన్ని ప్రైవేటీకరించొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్షాను గత ఫిబ్రవరిలో కలిసి పవన్ కల్యాణ్ కోరారు.